దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.19 గంటల సమయంలో సెన్సెక్స్ 135 పాయింట్ల లాభంతో 74,618 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 22,652 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎంఅండ్ఎం, రిలయన్స్, పవర్గ్రిడ్, HDFC బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐటీసీ, టాటా స్టీల్, సన్ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి.