సీఎం
జగన్ పై రాయి దాడి కేసులో అధికారులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సతీశ్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. న్యాయవాది సమక్షంలో పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సతీశ్ను 3 రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5గం. వరకు విచారించనున్నారు. కాగా నిన్న సతీశ్ను పోలీసు కస్టడీకి ఇస్తూ విజయవాడ ప్రిన్సిపల్, సివిల్, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.