ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లా నాన్పరా పట్టణంలో ఫిబ్రవరి 17 (శనివారం) సాయంత్రం వేళలో జరిగిన విషాద ఘటన ఇవాళ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఏడాది బాలిక ఆడుకుంటోంది. అయితే, రెహ్మాన్ అనే వ్యక్తి బాలికకు ఆహారం పెడతానని చెప్పి పొలాల్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అమాయక బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక పరిస్థితి విషమించి, చనిపోవడంతో రెహ్మాన్ బాలికను పొలంలో పడేసి పారిపోయాడు. కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించగా దర్యాప్తు చేపట్టి అతన్ని అరెస్ట్ చేశారు.