భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ లోని గదిలో టెన్త్ చదువుతున్న ఇద్దరు బాలికలు ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటన స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. 'మేం వెళ్లిపోతున్నందుకు మమ్మల్ని క్షమించండి. మేం తప్పు చేయకపోయినా అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాటలు తీసుకోలేకపోతున్నాం. మమ్మల్ని మా శైలజ మేడం తప్ప ఎవరూ నమ్మలేదు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నాం. మా ఇద్దరినీ ఒకచోటే సమాధి చేయండి’ అని ఆ లేఖలో రాసి ఉంది.