ఫీజు చెల్లించలేదని విద్యార్థులను గేటు బయట రోడ్డుపై కూర్చోబెట్టారు (వీడియో)

62చూసినవారు
స్కూల్ ఫీజు చెల్లించకపోవడంతో ఓ పాఠశాల తమ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. వారిని స్కూల్ గేటు బయట రోడ్డుపై కూర్చోబెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో ఉన్న శ్యామ్‌రాజి హైస్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ఫీజు చెల్లించని కారణంగా విద్యార్థులను రోడ్డుపై ఎండలో కూర్చొబెట్టి అవమానించారు. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్