రాహుల్ గాంధీకి సమన్లు

70చూసినవారు
రాహుల్ గాంధీకి సమన్లు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అస్సాం సీఐడీ పోలీసులు సోమవారం సమన్లు జారీ చేశారు. ఫిబ్రవరి 23న తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా గత నెలలో గౌహతిలో నిర్దేశించిన రూట్‌లో యాత్ర సాగలేదు. దీనిపై ఉద్రిక్తత తలెత్తింది. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ కీలక నేతలు కేసీ వేణుగోపాల్, జితేంద్ర సింగ్, భూపేన్ కుమార్ బోరా, ఎంపీ గౌరవ్ గొగోయ్, దేబబ్రత సైకియాలకు పోలీసులు నోటీసులు పంపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్