అప్పన్న ఆలయానికి తక్కువ ధరకే నెయ్యి సరఫరా..

73చూసినవారు
అప్పన్న ఆలయానికి తక్కువ ధరకే నెయ్యి సరఫరా..
విశాఖలోని సింహాద్రి అప్పన్న ఆలయానికి విజయ, విశాఖ డెయిరీ నుంచి నెయ్యి సరఫరా అయ్యేది. గత ప్రభుత్వంలో తొలి మూడేళ్లు ఆ డెయిరీ నుంచే కిలో రూ.591కి నెయ్యి కొనుగోలు చేశారు. 2022-23లో ప్రీమియర్‌ యాగ్రోటెక్‌ ఫుడ్స్‌ అనే సంస్థ కిలో రూ.393కే టెండరు దక్కించుకొని, నెయ్యి సరఫరా చేసింది. 2023-24లో సూర్యకుమారి ఏజెన్సీస్‌ అనే సంస్థ కిలో రూ.529 ధరతో నెయ్యి అందజేసింది. ప్రస్తుతం ఏలూరు జిల్లాకు చెందిన రైతు డెయిరీ కిలో రూ.385 ధరతో టెండరు దక్కించుకొని, నెయ్యి సరఫరా చేస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్