నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై తహసిల్దార్ కార్యాలయం వద్ద రోడ్డులోని ఎమ్మార్వో కార్యాలయం ముందు బుధవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా గాయపడిన వారు కొండమల్లేపల్లి కొందలపహడు గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది.