రోడ్డు ప్రమాదం ఘటనపై జిల్లా ఎస్పీ దిగ్భ్రాంతి

5361చూసినవారు
కోదాడ శివార్లలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటా హుటిన కోదాడ వైద్యశాలకు చేరుకొని గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డిఎస్పి శ్రీధర్ రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్