సూర్యాపేట కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు!

5095చూసినవారు
సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో శుక్రవారం వివాదం చోటు చేసుకుంది. ఫ్లెక్సీలో దామోదర్ రెడ్డి ఫోటో పెట్టి.. పటేల్ రమేష్‌ రెడ్డి ఫోటో వేయకపోవడం వివాదానికి దారి తీసింది. పటేల్ రమేష్ రెడ్డికి కార్యక్రమానికి ఆహ్వానం సైతం పంపలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జానారెడ్డి మాట్లాడుతూ.. అతి చేస్తే మర్యాద ఇవ్వం.. ఉంటే ఉండండి లేదంటే వెళ్ళిపొండి అంటూ రమేష్ రెడ్డి వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.