ముమ్మరంగా కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు
సూర్యాపేట మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం మండలంలోని రాయినిగూడెం, కేసారం గ్రామాలలో చెరువులలో మట్టి తోలకం పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పిస్తూ ఈ పథకం చేపట్టింది.