మీకూ ఏపీ అధికారులకు పట్టిన గతే పడుతుంది: హరీశ్‌రావు

83చూసినవారు
మీకూ ఏపీ అధికారులకు పట్టిన గతే పడుతుంది: హరీశ్‌రావు
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం శాశ్వతం కాదని, అధికారులు రెచ్చిపోవద్దని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'ఏపీలో గత ప్రభుత్వంలో అధికారులు రెచ్చిపోయారు.. ప్రస్తుతం సస్పెండ్‌ అవుతున్నారు. అధికారంలో ఉన్నామని రెచ్చిపోతే అక్కడి అధికారులకు పట్టిన గతే మీకూ పడుతుంది. మాపై దాడులు చేసిన వారిపై ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయలేదు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్