ఆటోను ఢీకొన్న లారీ యువకుడు మృతి..

65చూసినవారు
ఆటోను ఢీకొన్న లారీ యువకుడు మృతి..
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ క్రషర్ మిల్లు సమీపంలో, శనివారం రోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో తిరుమలగిరి కి చెందిన, మహమ్మద్ అమీర్ అక్కడికక్కడ మృతి చెందాడు. అమీర్, తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ గౌడ్, తెలిపారు.

ట్యాగ్స్ :