మార్కెట్లో ధాన్యం అమ్మడానికి మొగ్గు చూపుతున్న రైతులు..
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్, ధాన్యాన్ని అమ్మడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ , ఎండ తీవ్రత, కాంటాలు ఆలస్యం కావడం తో మార్కెట్ కి రైతు లు ధాన్యం తేవడానికి మోగ్గు చూపుతున్నారు. తాజాగా మార్కెట్ కి 39, 762 బస్తాల ధాన్యం వచ్చినట్లు వెల్లడించారు. క్వింటాకి గరిష్టంగా 1989, కనిష్టంగా 1659 ధర పలుకుతోంది.