ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా సహకరించాలి
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని అడ్డగూడూరు మండల కేంద్రంలో శుక్రవారం ఎంపీ ఎన్నికల సందర్భంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు ఎస్సై నాగరాజు కర్ణాటక రాష్ట్ర సిబ్బంది స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.