బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
సూర్యాపేట జిల్లా మద్దిరాలలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు ఎస్ఏ రజాక్ మాట్లాడుతూ, బిఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ యాదవ్ ని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామ శాఖ అధ్యక్షులు, వడ్డానం మధుసూదన్, మాజీ ఉపసర్పంచ్ మల్యాల నరసయ్య, మాజీ వార్డ్ మెంబర్ రాంపాక నాగరాజు, వీరమల్లు, దామోదర్ రెడ్డి, రవి, రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.