ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో టీడీపీ-జనసేన-బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగారు. అటు వైసీపీ కార్యలయాలు వెలవెలబోతున్నాయి. కాగా, కొందరు వైసీపీ సింబల్ అయిన ఫ్యాన్తో శవయాత్ర నిర్వహించారు. పాడెపై ఫ్యాన్ను ఉంచి ఊరేగింపు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.