భైరవుడి కళ్ల నుంచి కన్నీరు.. సంక్షోభానికి సంకేతం

63చూసినవారు
భైరవుడి కళ్ల నుంచి కన్నీరు.. సంక్షోభానికి సంకేతం
హిమాచల్‌ప్రదేశ్ నాగర్‌కోట పట్టణంలోని కాంగ్రా వజ్రేశ్వరి దేవి ఆలయంలో 5 వేల ఏళ్ల నాటి కాల భైరవుని విగ్రహం ఉంది. అయితే, చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైనా సంక్షోభం సంభవించినప్పుడు ఈ భైరవ విగ్రహం కళ్ల నుంచి కన్నీరు కారుతుందని స్థానికుల విశ్వాసం. ఇలా కన్నీళ్లు రావడం చూసిన వెంటనే స్థానికులు, ఆలయ పూజారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే, ఈ భైరవుడి కన్నీళ్ల వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటో ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్