ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్కు బయల్దేరిన ఓ విమానం ప్రయాణికులకు నరకం చూపించింది. సోమవారం సిడ్నీ నుంచి ఆక్లాండ్కు వెళుతున్న ఎల్ఏ800 బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా బలమైన కదుపులకు లోనై 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇది చిలీకి చెందిన లటమ్ ఎయిర్లైన్స్కు చెందినది. 50 మంది బాధితుల్లో విమాన సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం.