వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకునేవారిని ఎంతకాలం ఆపగలం, అది వారిష్టం.. విలువలు, నైతికత అనేవి వారికి ఉండాలి. వెళ్లేవారు వెళతారు. బలంగా నిలబడగలిగేవారే నాతో ఉంటారు' అని పార్టీ నేతలతో అన్నట్లు సమాచారం. వెనక్కి తగ్గకూడదు, మళ్లీ ముందుకు కదలాలని ఆయన నేతలకు పిలుపునిచ్చారు.