తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ తన ఇంట్లోని బాత్ రూమ్ లో పడి అపస్మారక స్థితిలోకి పోయినట్లు ఆయన కుమారుడు సుభ్రాంగ్షు రాయ్ తెలిపారు. దీంతో ఆయన్ను కోల్కతాలోని ఆసుపత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు. తలకు బలమైన గాయమవడంతోనే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు తెలుస్తోంది.