నీట్, నెట్ ప్రశ్న పత్రాలకు సంబంధించి అనధికారిక సమాచారాన్ని వ్యాప్తి చేసిన ఛానళ్లను బ్లాక్ చేసినట్లు టెలిగ్రాం వెల్లడించింది. దేశ చట్టాలకు లోబడి, దర్యాప్తునకు సహకరిస్తున్నామని తెలిపింది. లీకేజీ వ్యవహారంలో ఈ సోషల్ మీడియా సంస్థపైనా విమర్శలు వచ్చాయి. దీంతో సంస్థ స్పందించింది. టెలిగ్రాంలో లీకైన పేపర్లు అసలు పత్రంతో సరిపోలాయని ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.