రానున్న రోజుల్లో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రాజధాని ఢిల్లీలో సోమవారం ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్ను దాటింది. స్థానిక వాతావరణ శాఖ ప్రకారం, ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఉష్ణోగ్రత 46.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. నజఫ్గఢ్లో ఉష్ణోగ్రత 46.3 డిగ్రీలకు చేరుకుంది.