అప్పుల బాధతో సిద్దిపేట జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య

51చూసినవారు
అప్పుల బాధతో సిద్దిపేట జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన జరిగింది. తొగుట మండల పరిధిలోని గల కన్గల్‌ గ్రామంలో అప్పుల బాధతో ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దొమ్మాట స్వామి(35) అనే రైతు గత ఐదేళ్లుగా మూడెకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. అయితే పంటలు సరిగ్గా పండకపోవడంతో అప్పులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో తాను కౌలుకు చేస్తున్న వ్యవసాయ పొలం వద్ద వేప చెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్