రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైకోర్టుకు వర్సిటీ భూమి కేటాయింపును నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన చేపట్టారు. పరీక్షకు వెళ్తున్న విద్యార్థులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. సెకండియర్
విద్యార్థులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జీవో 55 రద్దు చేసేంత వరకు
పరీక్షలు జరపవద్దని హెచ్చరించి.. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి
విద్యార్థులు తాళాలు వేశారు.