కాంగోలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. తూర్పు కాంగోలోని గ్రామాలపై దాడి చేసి 11 మందిని చంపారు. అంతేకాకుండా.. కొన్ని వాహనాలను తగలబెట్టగా, మరికొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని స్థానిక మేయర్ ఎన్గోంగో మయాంగా ఆదివారం తెలిపారు. అయితే కొన్ని నెలలుగా ఆఫ్రికాలోని ఏదో ఒక దేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.