వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని CM జగన్ ఆరోపించారు. హోదా ఏమైనా సంజీవనా? అని బాబు అన్నారని గుర్తుచేశారు. 'పిల్లనిచ్చిన మామపై చెప్పులు వేయించి NTR చావుకు కారణమయ్యాడు. అవసరమైనప్పుడు NTR ఫొటో బయటకు తీస్తాడు. దొంగ వాగ్దానాలు చేయడమే ఈ పెద్దమనిషికి తెలుసు. బాబును నమ్మడమంటే చెరువులో చేపలకు కొంగల్ని కాపలాగా పెట్టడమే. పులి నోట్లో తల పెట్టినట్లే' అని విమర్శించారు.