కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శశి థరూర్కు ఎన్నికల కమిషన్ వార్నింగ్ ఇచ్చింది. తిరువనంతపురం ఎన్డీఏ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్పై ఆరోపణలు చేసిన కేసులో శశిథరూర్ను ఈసీ హెచ్చరించింది. మతపరమైన సంస్థలకు చంద్రశేఖర్ ప్రచార సమయంలో డబ్బులు ఇస్తున్నారని థరూర్ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా భావించిన ఈసీ, వాటిని రుజువు చేసేందుకు ఎటువంటి ఆధారాలను శశి థరూర్ చూపించలేదని పేర్కొంది.