కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రిగా హెచ్డీ కుమారస్వామి బాధ్యతలు చేపట్టారు. తానేమీ స్వార్థపరుడిని కాదు అని, కేవలం స్వంత రాష్ట్రం కోసం కాకుండా, యావత్ దేశం కోసం పనిచేయనున్నట్లు చెప్పారు. కర్ణాటకలో టెస్లా లాంటి కంపెనీలు ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయా అని ఓ రిపోర్టర్ అడిగగా.. దానిపై మంత్రి కుమారస్వామి స్పందించారు. అవును, ఆ ఆలోచన ఉందని, ఆ కంపెనీతో చర్చిస్తామని అన్నారు.