కేజ్రీవాల్‌ పిటిషన్‌ పై తీర్పును రిజర్వ్‌ చేసిన ధర్మాసనం

72చూసినవారు
కేజ్రీవాల్‌ పిటిషన్‌ పై తీర్పును రిజర్వ్‌ చేసిన ధర్మాసనం
లిక్కర్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో సీఎం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, విక్రమ్‌ చౌదరి.. సీబీఐ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డీపీ సింగ్‌ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 29న హైకోర్టు విచారణ జరుపనున్నది.

సంబంధిత పోస్ట్