నేపాల్లోని బగ్లుంగ్ జిల్లా నిసిఖోలా ప్రాంతంలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు 200 మీటర్ల లోతులో పడిపోయింది. ఈ దుర్ఘటనలో బస్సులోని 8 మంది ప్రయాణికులు చనిపోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బస్సు రుకుమ్ పుర్బా నుంచి ఖాట్మండుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.