రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో సోమవారం జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మొదటిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో ప్రసంగించారు. రాహుల్ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా తప్పుడు సమాచారం అందించారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మండిపడ్డారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పార్లమెంట్ వేదిక కారాదని అన్నారు.