తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ

67చూసినవారు
తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కాగా, నిన్న స్వామివారిని 59,621 మంది భక్తులు దర్శించుకోగా.. 28,351 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్