కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET) దరఖాస్తుల గడువును సీబీఎస్ఈ(CBSE) పొడిగించింది. వాస్తవానికి సీటెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 2 రాత్రితో ముగిసింది. అయితే, ఆ గడువును ఏప్రిల్ 5 వరకు పొడిగిస్తూ సీబీఎస్ఈ నిర్ణయం తీసుకుంది. జనరల్/ఓబీసీ అభ్యర్థులు ఒక పేపర్కు రూ.1000, రెండు పేపర్లకు రూ.1200, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులైతే ఒక పేపర్కు రూ.500, రెండు పేపర్లకు రూ.600ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
వెబ్సైట్: https://ctet.nic.in/