దేశంలోని నగరాలు, పట్టణాల్లో దశాబ్దాల నాటి మురుగునీటి పారుదల వ్యవస్థే నేటికీ వినియోగంలో ఉంది. చాలాచోట్ల పట్టణీకరణకు తగినట్లుగా డ్రైనేజీ వ్యవస్థ విస్తరణ జరగడం లేదు. కురుస్తున్న భారీ వర్షానికి అనుగుణంగా మురుగునీటి కాలువల సామర్థ్యం లేకపోవడం, చాలా చోట్ల వరద నీటి కాలువల నిర్మాణం జరగకపోవడం ముంపు ఉద్ధృతికి కారణమవుతోంది. ఇండియాలో మూతలేని డ్రైౖనేజీ కాలువలే అధికం. వర్షాకాలంలో అవి నిండి మురుగు నీరు రోడ్లపైకి ప్రవహిస్తోంది.