నాలుగో రోజుకు ఆతిశీ నిరాహార దీక్ష

75చూసినవారు
నాలుగో రోజుకు ఆతిశీ నిరాహార దీక్ష
ఆప్ మంత్రి ఆతిశీ చేపట్టిన నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీకి దక్కాల్సిన నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన సరైన నీటి వాటాను విడుదల చేసే వరకు ఈ దీక్ష కొనసాగుతుందని ఆతిశీ స్పష్టం చేశారు. హర్యానా గత మూడు వారాలుగా యమునా నీటిలో ఢిల్లీ వాటాను రోజుకు 100 మిలియన్ గ్యాలన్లు తగ్గించిందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్