దేశంలో వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజ్తో యువత భవిష్యత్ నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ సింగ్ హుడా ఆందోళన వ్యక్తం చేశారు. హర్యాణాలో అత్యధికంగా పేపర్ లీకేజ్ కేసులు వెలుగుచూశాయని చెప్పారు. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతల నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. తాము ఈ అంశాన్ని ఇవాళ పార్లమెంట్లో చర్చకు లేవనెత్తితే మైక్ను స్విచాఫ్ చేశారని మండిపడ్డారు.