లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్కు శుక్రవారం షాక్ తగిలింది. ఆయనకు గ్వాలియర్ నగర ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్ పోలీసులు 1997లో నమోదు చేసిన అక్రమ ఆయుధాల కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో విచారణ చేపట్టిన కోర్టు లాలూకు అరెస్ట్ వారెంట్ పంపింది. దీంతో మరోసారి లాలూ జైలుకు వెళ్లే ప్రమాదం ఉంది.