రోజూరోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఒడిశా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఇకపై మూడు సార్లు వాటర్ బెల్ మోగించాలని, విద్యార్థులు, ఉఫాధ్యాయులను నీరు తాగాలని సూచించింది. దీంతో ప్రతి రోజూ ఉదయం 8.30, 10:00, 11:00 గంటలకు వాటర్ బెల్ మోగించనున్నారు. కాగా కేరళ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటర్ బెల్ స్పెషల్ రూల్ను తీసుకొచ్చాయి.