పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నిర్వహించిన 'ప్రజాగళం' రోడ్ షోలో వైసీపీ సర్కార్, సీఎం జగన్పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. "వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేసింది. ఆ పార్టీ డీఎన్ఏలోనే శవ రాజకీయం ఉంది. తండ్రి లేని బిడ్డ అని గతంలో జగన్ సానుభూతి పొందారు. వైసీపీకి గొడ్డలి గుర్తు పెట్టుకోవాలి. ప్రజల జీవితాలతో ఆడుకునే జలగ.. జగన్. జే బ్రాండ్ మద్యం, గంజాయి, డ్రగ్స్ తెచ్చారు." అని ఆయన ఫైర్ అయ్యారు.