లోక్సభ ఎన్నికలకు ముందు ఒడిశాలో అధికార BJDకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్యే రమేష్ చంద్ర సాయి రాజీనామా చేశారు. BJD అధ్యక్షుడు, సీఎం నవీన్ పట్నాయక్కు ఆయన రాజీనామా లేఖను పంపారు. అనంతరం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో శుక్రవారం BJPలో చేరారు. తన మద్దతుదారులతో కలిసి ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రమేష్ చంద్రకు BJD టికెట్ నిరాకరించింది.