ఇకపై సినిమాలకు గుడ్బై చెబుతున్నానని కర్ణాటక మాజీ సీఎం తనయుడు, జేడీఎస్ యువ విభాగం అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి తెలిపారు. ఇక పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితం అవుతానని స్పష్టం చేశారు. మండ్యలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుమారస్వామిపై మండ్య ప్రజలు చూపిన గౌరవం, ప్రేమ అభిమానాలను కాపాడుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బలోపేతం చేయాలన్నది కుమారస్వామి ఆశయమన్నారు. దూరదృష్టి ఉన్నందునే బీజేపీతో కలసి ముందుకెళ్లామని పేర్కొన్నారు.