భార్యపై కిరోసిన్ పోసి తగలబెట్టిన భర్త

588చూసినవారు
భార్యపై కిరోసిన్ పోసి తగలబెట్టిన భర్త
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో దారుణం జరిగింది. ఓ భర్త.. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె సజీవ దహనమై చనిపోయింది. ఈ ఘటన మార్చి 5న చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భార్యపై చిన్న వివాదం తలెత్తడంతో భర్త కిరోసిన్ పోసి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్