TG: వ్యక్తి కిడ్నాప్ కలకలం.. అసలేమైందంటే?

64చూసినవారు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో చేపల్ మార్కెట్ సమీపం లో కిడ్నాప్ కలకలం రేపింది. ఉదయం కారులో వచ్చిన కొంత మంది వ్యక్తులు బైక్ పై వెళుతున్న వ్యక్తిని ఢీ కొని వ్యక్తిని కిడ్నాప్ చేశారు. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన ధనుష్ ని అదే గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేసినట్లు సమాచారం. పోలీసులు కిడ్నాప్ చేసిన వ్యక్తులతో పాటు కిడ్నాపైన వ్యక్తిని అదుపులో తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు మాత్రం ఈ విషయంపై మీడియా ముందుకు రావడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్