యూపీలోని ఝాన్సీ జిల్లా సమతార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. జితేంద్ర కుమార్తో దీప అనే యువతిని ఇచ్చి పెద్దలు గురువారం పెళ్లి నిశ్చయించారు. అతిథులు భోజనం చేస్తుండగా అక్కడికి వినీత, పూజ ఇద్దరు మహిళలు వచ్చారు. జితేంద్రకు వినీత మొదటి భార్య కాగా పూజ రెండో భార్య. వారితో అతడికి పిల్లలు కూడా ఉన్నారు. విషయం తెలుసుకున్న వధువు బంధువులు జితేంద్రపై దాడి చేసి, పోలీసులకు అప్పగించారు.