అన్న పోయాక వదినను పెళ్లాడిన యువకుడిని అతడి సోదరులే హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో తాజాగా వెలుగు చూసింది. బాగ్పత్ గ్రామానికి చెందిన ఈశ్వర్ అనే వ్యక్తికి సుఖ్వీర్, ఓంవీర్, ఉదయ్వీర్, యశ్వీర్ అనే నలుగురు కుమారులున్నారు. గతేడాది సుఖ్వీర్ మృతి చెందడంతో అతడి భార్య రితూను యశ్వీర్ (32) పెళ్లి చేసుకున్నాడు. ఇది మిగతా సోదరులకు నచ్చకపోవడంతో తుపాకీతో యశ్వీర్ను కాల్చి చంపారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.