కొముర
వెల్లి పుణ్యక్షేత్రం నిన్న భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణమంతా మల్లన్న నామస్మరణతో మార్మోగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11వ ఆదివారానికి చుట్టుపక్కల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కోనేరులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు ఒడిబియ్యం పోసి, గంగిరేగు చెట్టువద్ద పట్నాలు వేసి ముడుపులు కట్టారు. అలాగే కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించుకున్నారు.