దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 536 పాయింట్లు లాభపడి 74,188 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 22,495 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.34 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్-30 సూచీలో JSW స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, HDFC బ్యాంక్, SBI, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, HCL టెక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.