కిరాణా షాప్‌లో గంజాయి విక్రయిస్తున్న మహిళ అరెస్ట్

1916చూసినవారు
కిరాణా షాప్‌లో గంజాయి విక్రయిస్తున్న మహిళ అరెస్ట్
నానక్‌రామ్‌గూడలో ఓ మహిళ నడుపుతున్న కిరాణా షాపులో మాదాపూర్ ఎస్ ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. షాపులో అమ్మకానికి ఉంచిన 300 గ్రా. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న అనురాధ బాయి అనే మహిళను అరెస్ట్ చేశారు. విచారణలో దూల్‌పేట్‌ నుండి గంజాయిని సేకరించి చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విద్యార్థులకు, కూలీలకు విక్రయిస్తున్నట్లు ఆమె తెలిపింది. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్