ఏప్రిల్‌ 1 నుంచి ఆ వాహనాల ధరలు పెంపు

68చూసినవారు
ఏప్రిల్‌ 1 నుంచి ఆ వాహనాల ధరలు పెంపు
ప్రముఖ వాహనాల తయారీ సంస్థ కియా ఇండియా కార్ల ధరల పెంపునకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కారు ధరల్ని 3 శాతం వరకు పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు పెరిగిన కొత్త ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. నిర్వహణ వ్యయాలు, ముడి సరకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కియా ఇండియా నేషనల్‌ హెడ్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ హర్దీప్‌సింగ్‌ బ్రార్‌ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్